‘పార్లమెంట్‌లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ’

Update: 2018-08-30 06:01 GMT

నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తండ్రికి తగిన తనయుడిగా పెరిగిన హరికృష్ణ మరణం విషాదాన్ని మిగిల్చిందన్నారు వెంకయ్య నాయుడు. హరికృష్ణ ఏ పని చేసినా చిత్తశుద్దితో చేసేవారని.. ఏవిషయంలోనైనా ఏం చెప్పదలకున్నా కుండబద్దలుగా చెప్పేవారన్నారు వెంకయ్య నాయుడు. పార్లమెంట్‌లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించారు. 

Similar News