ఈ మధ్య హీరో సునీల్ కు కాలం కలిసి రావడం లేదనే చెప్పుకోవాలి. ఓవైపు ఆశించిన స్థాయిలో సినిమాలకు ఆడకపోవడంతో కృంగి పోకుండా వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఈనేపథ్యంలో సునీల్ కొన్ని ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకున్నాడు. డైరక్టర్ మారుతి భలే భలే మగాడివోయ్ సినిమాను తొలత సునీల్ తో చేయాల్సి ఉంది. అయితే భలే భలే మగాడివోయ్ కథ విన్న సునీల్ మతిమరుపు హీరో క్యారక్టర్ ను మహేష్ బాబు ఒక్కడు తరహాలో మార్పులు చేయమని అన్నారని ఆ సినిమా డైరక్టర్ మారుతి పలు సందర్బాల్లో గుర్తు చేశారు. దీనిపై స్పందించిన సునీల్ మతిమరుపు ఉన్న హీరో కథను ఒక్కడు లాగా చేయమని చెప్పడానికి నేనేమైనా మహేష్ బాబునా అంటూ ప్రశ్నించారు. అసలు మారుతీ పూర్తి కథ చెప్పలేదన్నారు. అంతే తప్ప తాను చేయను అని చెప్పలేదని అని స్పష్టం చేసాడు. చిరంజీవి ఖైదీ 150లో చేయకపోవడంపై ఈడు గోల్డ్ ఎహే డేట్స్ క్లాష్ కావడం గురించే అని చెప్పి మరో సారి క్లారిటీ ఇచ్చాడు. సైరా - త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాల్లో తన రోల్ ఉంటుందని అన్నారు.