''మళ్లీ రావా'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సుమంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. మామయ్య అక్కినేని నాగార్జున జోక్యం వల్లే కీర్తి రెడ్డితో తనకు విడాకులయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సుమంత్. కీర్తిరెడ్డితో తను విడిపోవడానికి గల కారణం వివరించాడు. ఏడాదిన్నర మాత్రమే నిలిచిన సుమంత్-కీర్తిరెడ్డిల బంధం విడిపోవడానికి గల కారణం... ఇద్దరి వ్యక్తిత్వాలతో పాటు జీవితాలు కూడా పూర్తి భిన్నమని వారిద్దరు తెలుసుకోవడమేనట. కలిసి ఉండలేమని భావించిన వీరిరివురు ఉమ్మడి అంగీకారంతో ..సుహృద్భావ వాతావరణంలో విడిపోవడానికి నిర్ణయించుకున్నామని సుమంత్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో హ్యపీగా ఉంటున్న కీర్తి తనకి టచ్లోనే ఉందని, కీర్తి కుటుంబం తననెంతో గౌరవిస్తుందని సుమంత్ పేర్కొన్నాడు. చివరి సారిగా ఏఎన్ఆర్ చనిపోయినప్పుడు కీర్తి వచ్చి వెళ్ళిందని సుమంత్ అన్నాడు.