తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్బాస్’ సీజన్ 2 ప్రసారానికి ముహూర్తం ఖరారైంది. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమంలో.. ‘ఎందరో మహానుభావులు అందరికీ మీ ఎన్టీఆర్ పాదాభివందనాలు’ అంటూ బుల్లితెరపై ఎన్టీఆర్ ‘బిగ్ బాస్ సీజన్ 1’తో అదరగొట్టేశాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్గా వ్యవహరిస్తూ.. 'జూన్ 10..100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు అంటూ ఈసారి ఇంకాస్త మసాలా అంటూ విజిలేస్తూ సూపర్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చే నెల జూన్ 10 నుండి స్టార్ మా ఛానల్లో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు.. అలాగే సోమ, శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది ఈ కార్యక్రమం. బిగ్బాస్ 2 సెట్లో కంటెస్టంట్స్కు మంచి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచనున్నారని టాక్. అంతేకాకుండా సీజన్ 2కు ప్రైజ్మనీని భారీ మొత్తంలో పెంచనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే హౌజ్ మేట్స్కి సంబంధించిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది
- హీరో రాజ్ తరుణ్
- సింగర్ గీతా మాధురి
- యాంకర్ శ్యామల
- యాంకర్ లాస్య
- హీరోయిన్ రాశి
- హీరోయిన్ చార్మి కౌర్
- ధన్య బాలకృష్ణ
- జూనియర్ శ్రీదేవి
- హీరోయిన్ గజాలా
- చాందిని చౌదరి
- శ్రీ రెడ్డి
- వరుణ్ సందేశ్
- థనీష్
- వైవా హర్షా
- కమెడీయన్ వేణు
- ఆర్యన్ రాజేష్
ఈ పదహారు మంది కంటెస్టెంట్స్ సీజన్ 2లో పాల్గొననున్నారని తెలుస్తుండగా, దీనిపై అఫీషియల్ ప్రకటన రావలసి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ లు చేసిన శ్రీ రెడ్డి ఇందులో భాగం కావడం అనే వార్త అందరికి షాకింగ్గా మారింది. శ్రీ రెడ్డి నేచురల్ స్టార్ నాని, వైవా హర్షాలపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.