37 ఏళ్ళ వయస్సులోను తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న గ్లామర్ బ్యూటీ శ్రియ. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు దాటిన ఇప్పటికి ఈ అమ్మడు అభిమానులకి కొత్తగానే కనిపిస్తుంటుంది. ఇటీవల గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో వశిష్టి దేవిగా నటించిన శ్రియ తన నటనతో ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఆ తర్వాత మళ్ళీ బాలయ్యతో పైసా వసూల్ చేసింది. ప్రస్తుతం గాయత్రి అనే సినిమాలో విష్ణు సరసన నటిస్తుంది . ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. అయితే ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి నటిగా పేరుతెచ్చుకున్న శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల పరిచయం అయిన ఓ రష్యన్ యువకుడితో శ్రియ సన్నిహితంగా ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. ఆ యువకుడినే వచ్చే నెలలో వివాహమాడేందుకు రెడీ అవుతుందట. తన విషయంపై అబ్బాయి తరపు వారితో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యా వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. డెహ్రడూన్ కు చెందిన ఈ భామ డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ లో శ్రియ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయిట. అయితే ఈ విషయంపై శ్రియ తరపు నుంచి ఎలాంటి అధికారిక సమాచరం లేదు.