ధావన్‌ కొంటె పని.!

Update: 2018-04-17 12:34 GMT

టీమిండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్.. టీమ్ మేట్స్‌ను ఆటపట్టించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఐపీఎల్ పదకొండో సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడంతో ధావన్ మాంచి మూడ్‌లో ఉన్నాడు. ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్న సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు మైదానంలో ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రయాణ సమయాల్లో సహచర ఆటగాళ్లతో జోకులు పేల్చుకుంటూ.. వినూత్నంగా ఫొటోలకు ఫోజులిస్తూ.. వాటిని  సోషల్‌ మీడియాలో​ పంచుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం సన్‌రైజర్స్‌హైదరాబాద్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ విమానంలో చేసిన ఓ కొంటె పని నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ధావన్‌.. గాఢంగా నిద్రపోతున్న సహచర ఆటగాళ్లు షకీబ్‌ అల్‌ హసన్‌, రషీద్‌ఖాన్‌లను ఆటపట్టించాడు. ఓ పేపర్‌ను గుండ్రంగా చుట్టి దానితో ఈ ఆటగాళ్ల ముక్కుల్లో పెడుతూ.. వారిని నిద్ర చెడగొట్టాడు. తొలుత ఏం జరుగుతుందో అర్థం కానీ ఈ ఆటగాళ్లు తేరుకొని ఇది గబ్బర్‌ పనేనని లైట్‌ తీసుకున్నారు. అయితే ఈ సమయంలో ఇతర ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు.

Similar News