కేరళ యువ వికెట్ కీపర్ సంజు శాంసన్కు షాక్ తగిలింది. యొ యొ టెస్ట్ ఫెయిలవడంతో ఇంగ్లండ్ టూర్కెళ్లే ఇండియా ఎ టీమ్లో చోటు కోల్పోయాడు. జూన్ 17 నుంచి ఇంగ్లండ్ వేదికగా మూడు జూనియర్ జాతీయ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. వెస్టిండీస్- ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ కోసం ఇటీవల భారత- ఎ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. కాగా, క్రికెటర్లందరికీ మూడు రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ టెస్టుని నిర్వహించారు. ఈ టెస్టులో సంజు శాంసన్ ఫెయిలవడంతో అతన్ని ఇంగ్లండ్కు వెళ్లే జట్టు నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తప్పించింది. భారతత-ఎ జట్టుకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. జట్టులో పృథ్వీ షా, శుభమన్ గిల్, రిషబ్ పంత్ తదితర యువ క్రికెటర్లకి చోటు దక్కింది. తాజాగా సంజూ శాంసన్ జట్టు నుంచి పక్కకి వెళ్లడంతో.. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపట్టనున్నాడు.