భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సానియా మీర్జా మళ్లీ సోషల్ మీడియాలోకి మళ్లీ అడుగుపెట్టింది. తమ చిన్నారి తనయుడికి స్వాగతం పలుకుతూ.. ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఇవాళ ఆమె తన కుమారుడు ఇజాన్ తొలి పోటోను షేర్ చేసుకుంది. తన కుమారుడితో కలిసి షోయబ్ మాలిక్ ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ను టీవీలో చూశానంటూ తెగా మురిసిపోయింది సానియామీర్జా.తల్లిగా నేను, కుమారుడిగా నా బిడ్డ ఇజాన్ ఈ ప్రపంచంలోకి వచ్చి 5 రోజులైంది. నా కుమారుడితో కలిసి తండ్రి ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ కూడా వీక్షించాం. మేము వచ్చాక నిజంగా ఇదే పెద్ద మ్యాచ్. గతంలో ఎప్పడూ సాధించనంత గొప్ప విజయం. ఇంతకు ముందెన్నడూ పొందనంత మధురానుభూతి.. అంటూ సానియా వ్యాఖ్యానించింది.