సల్మాన్ బెయిల్ పిటీషన్ పై ముగిసిన వాదనలు

Update: 2018-04-07 10:09 GMT

సల్మాన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై జోధ్‌పూర్‌ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఇవాళ కూడా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రవీంద్రకుమార్ జోషి.. తీర్పును రెండు గంటలకు వెలువరించనున్నారు. దీంతో సల్మాన్ కు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇటు సల్మాన్ కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు హాజరయ్యారు. 

Similar News