చంద్రబాబు డైరెక్షన్లోనే ఆపరేషన్ గరుడ సాగుతోందని, గతంలో శివాజీ కేబినెట్ మీటింగ్లో పాల్గొనడమే దీనికి నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శివాజీ భయపడి అమెరికా పారిపోయారని ఎద్దేవా చేశారు. జగన్పై దాడి నాటకమంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ప్రతిపక్ష నేతలకు, ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకే కేంద్రహోంమంత్రి రాజ్నాథ్ను కలిసినట్లు రోజా తెలిపారు.