తన కష్టమర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇందులోభాగంగా చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీతో రిలయన్స్ జియో చేతులు కలిపింది. ఎవరైనా షియోమీ తయారు చేస్తున్న రెడ్ మీ 5ఏ ను కొనుగోలు చేస్తే వారికి రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇస్తున్నట్లు జియో ప్రకటించింది. బెటర్ టు గెదర్ ఆఫర్ లో భాగంగా రెడ్ మీ 5ఏ యూజర్లు రూ.1000ను అదనంగా పొందవచ్చన్న జియో షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. ఇందుకు రెడ్మీ 5ఎ వినియోగదారులు ఏడాది పాటు రూ.199తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఈ ఆఫర్ కింద 28 రోజుల పాటు రోజుకు ఒక జీబీ చొప్పున 28 జీబీ, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. నవంబరు 30-డిసెంబరు 5 మధ్య మొదటి రీచార్జ్ చేయించాలి. రూ.100 చొప్పున 10 వోచర్లు 12 నెలలలోపు వినియోగదారుల ఖాతాలోకి వస్తాయి. ఈ వోచర్లు రూ.399 కంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే మొత్తానికి మాత్రమే వాడాలి. అదనపు వివరాల కోసం జీయో కస్టమర్ కేర్ను సంప్రదించవచ్చు.