మెగా పవర్స్టార్ రామ్చరణ్, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న చిత్రం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కూడా ఖరారు కాలేదు. 'స్టేట్ రౌడీ' 'వినయ విధేయ రామ' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్రవర్గాలు ట్విటర్ ద్వారా వెల్లడించాయి. ఈనెల6న ఫస్ట్లుక్ను విడుదల చేసి 9న టీజర్ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు.
ఈసినిమాలో రామ్చరణ్కు జోడీగా కియారా అడ్వాణీ నటించారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తయింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్చరణ్ కొత్త లుక్లో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్లో నటించనున్నారు.