మెగా పవర్ స్టార్ రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ రంగస్థలం. ప్రపంచవ్యాప్తంగా 17వందల థియేటర్లలో విడుదలైంది. మూడు గంటల నిడివితో వచ్చిన రంగస్థలం...ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యాన్ని సుకుమార్ కళ్లకు కట్టినట్లు బాగా చూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు.
సినిమాలో ఫస్టాఫ్తో పాటు క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత రాంచరణ్ను తనలోని నటనను పూర్తి స్థాయిలో బయటపెట్టారని అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆది కూడా తన నటనతో ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేటట్లు చేశాయ్. రత్నవేలు ఫోటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, పూజా హెగ్డే సాంగ్ ఆకట్టుకున్నాయ్. రంగస్థలంలోని సెకండాఫ్ కొంత సాగదీసినా...సినిమా అద్యంతం ఆకట్టుకుంటుంది.