నటుడు దగ్గుబాటి రానా నిన్న తన 34వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ వేడుకకి రామ్ చరణ్, అఖిల్, సానియా మీర్జాతో పాటు పలువురు సన్నిహితులు హాజరై సందడి చేశారు. జపాన్లోను రానాకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా, అభిమానులు ఆర్కా మీడియా ఆఫీసుకి దాదాపు 19 బాక్సుల గిఫ్ట్లు, లేఖలు కానుకగా పంపించారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించారు. అయితే నిన్న సాయంత్రం జరిగిన పుట్టినరోజు వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని అఖిల్ తదితరులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా రానా ‘నా వైపు నుంచి ఎప్పుడూ కొందరిని మిస్ అవుతుంటాను. కానీ నా జీవితాన్ని ఆనందమయంగా మార్చినందుకు థాంక్యూ’ అని పోస్ట్ పెట్టాడు.