ఎనర్జిటిక్ హీరో తో డాషింగ్ డైరెక్టర్

Update: 2018-12-25 07:02 GMT

పూరి జగన్నాథ్ ఒకప్పుడు టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. కానీ 'పైసా వసూల్', 'మెహబూబా' సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో పూరి ఇమేజ్ బాగా దెబ్బతింది. అయితే ఇప్పుడు తన సత్తా చాటుకోవడానికి త్వరలో మన ముందుకు రానున్నాడు పూరి. ఈసారి ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక సినిమా చేయనున్నాడు. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి ఈ సినిమాను పూరి టూరింగ్ టాకీస్ మరియు లావణ్య ప్రజెంటేషన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొత్త సంవత్సరం జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది విడుదల చేస్తామని పూరి జగన్నాథ్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా తాలూకు హీరోయిన్ మరియు ఇతర కాస్ట్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటు రామ్ కూడా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన 'హలో గురు ప్రేమ కోసమే' కూడా సరిగ్గా ఆడలేదు అని తెలిసిన విషయమే. పూరి జగన్నాథ్ సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు రామ్. మరి ఈ ఫ్లాప్ దర్శకుడు మరియు హీరో ఈ సినిమా ద్వారా ఫార్మ్ లోకి వస్తారో లేదో చూడాలంటే వచ్చే ఏడాది మే వరకు ఆగాల్సిందే. 
 

Similar News