ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1, నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 లలో ఎవరికి కనిపించకుండా ఓ వ్యక్తి హౌజ్లోని అందరు కంటెస్టెంట్స్ని కంట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గాంభీర్యమైన గొంతుతో భయపెట్టించే ఆ వ్యక్తి అప్పుడప్పుడు టాస్క్లు ఇస్తూ, రూల్ అదిగమిస్తే వారిని హెచ్చరిస్తూ ఉంటారు. అజ్ఞాతవాసిలా ఉండే బిగ్ బాస్ ఎవరనే విషయాన్ని సీజన్ 1 పూర్తైన తర్వాత రివీల్ చేస్తారని అప్పట్లో అందరు భావించారు. కాని అలాంటిదేమి లేకుండా షో ముగించేశారు. ఇప్పుడు సీజన్ 2 మొదలైంది. ఇందులోను బిగ్ బాస్ది అదే గొంతు. మరి గంభీరమైన గొంతుతో ఉన్న ఆ గంభీరమైన మనిషి ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే వీటన్నింటికి సమాధానంగా ఓ వార్త హల్చల్ చేస్తోంది.
బిగ్బాస్కు వాయిస్ ఓవర్ ఇస్తున్నది ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. పలు సినిమాలు, సీరియల్లు, ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ బిగ్బాస్గా గొంతు సవరించారంట. ఇందుకోసం నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించి, రాధాకృష్ణను ఎంచుకున్నారట. అయితే ఈ వార్త ఎంత వరకూ అనేది రాధాకృష్ణ స్పందిస్తే తప్ప ఎవరికీ తెలియదు. బిగ్బాస్ ఏంచేస్తారంటే.. కంటెస్టంట్లకు టాస్క్ ఇవ్వడం, ఆదేశాలను జారీచేయడం, బిగ్బాస్ నియమనిబంధలను తెలియచెప్పడం వంటి పనులు చేస్తారు.