అగ్రసినీ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటించనున్నారు. కాగా ఈ చిత్రానికి ‘RRR’ గా పేరును వర్కింగ్ టైటిల్గా ఖరారు చేశారు. అయితే నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాజమౌళి ప్రకటించారు అయితే అదేరోజున మరో సర్ప్రైజ్ కూడా ఉందట. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి యంగ్ రెబెల్స్టార్ ప్రభాస్ అతిథిగా రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
1920 నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇందులో తారక్, రామ్చరణ్ బాక్సర్లుగా కనువిందుచేస్తారట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ రాశారు. ఇందులో తారక్, రామ్చరణ్కు జోడీగా ఎవరు నటించనున్నారన్నది తెలియాల్సి ఉంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది వరకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నరని సమాచారం.