తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనని కలవాలని కోరుకున్న చిట్టి అభిమాని మదన్ రెడ్డి కోరికను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెరవేర్చాడు. ఇటీవల ఆసుపత్రిలోని బెడ్పై కూర్చుని ‘ఐ వాంట్ టు మీట్ బాహుబలి’ అనే ఫ్లకార్డ్ చేతబట్టుకున్న బాలుడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని గమనించిన ప్రభాస్ వెంటనే స్పందించాడు. సదరు బాలుడి వివరాలు తెలుసుకుని అతడిని కలుసుకున్నాడు. చిట్టి అభిమానిని కలిసి ఆయనతో సరదాగా గడిపాడు. ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు ప్రస్తుతం చిట్టి అభిమానితో ప్రభాస్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.