పూనమ్ కౌర్ సంచలన పోస్ట్

Update: 2018-03-16 09:27 GMT

సినీ నటి పూనమ్ కౌర్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సంచలన పోస్ట్ చేసింది. బట్టలు మార్చినంత ఈజీగా.. మనుషులను మారుస్తూ రాజకీయాలు చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేసిందా.. అని అభిమానులు  ఆలోచనలో మునిగిపోతే... ఇప్పుడు ఈ పోస్ట్ సంచలనంగా మారింది. అంతలా ఆలోచింపజేసిన ఆ పోస్ట్‌లోని సందేశం యధావిధిగా.. ‘కాన్సెప్ట్ కాపీ చేసి.. డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చుకున్నట్లు మనుషులను మారుస్తూ.. మాట మీద ఉండకపోవడం.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. వేష భాషలు మారుస్తూ.. జనాలను మభ్యపెట్టి.. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..’ అంటూ పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సంచలనంగా మారింది.

Similar News