'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్నిచేసిన పాయల్ రాజ్పుత్. పాయల్ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడు. కాగా పాయల్ తెలుగులో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశారు. రెండో సినిమాతోనే మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం కొట్టేశారు. రవితేజ హీరోగా వి ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. టి. రామ్ నిర్మాత. ఇందులో ఓ కథానాయికగా 'నన్ను దోచుకుందువటే 'ఫేం నభా నటేష్ కనిపించనున్నారు. ఇప్పుడు మరో కథానాయికగా పాయల్ను దర్శక, నిర్మాతలు ఎంచుకున్నారు. ఆమె అయితే ఈ పాత్రకు బాగా సరిపోతారని వారు భావించారట. పాయల్ ఈ సినిమా పట్ల చాలా ఆనందంగా వ్యక్తం ఉన్నారు. స్క్రిప్ట్ పాయల్ కు ఎంతో నచ్చింది. త్వరలో షూట్లో పాల్గొననున్నారు అని పాయల్ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు.