చిరంజీవిని కలిసిన పవన్‌కల్యాణ్ దంపతులు

Update: 2018-08-22 10:20 GMT

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 63వ పుట్టిన రోజు వేడుకలను నేడు జరుపుకుంటున్నారు, తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవికి టాలీవుడ్ సినీ రంగస్థలానికి సంబంధించిన ప్రముఖులు, యంగ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి చిరంజీవిని కలిశారు. చిరంజీవికి పవన్‌కల్యాణ్, అన్నాలెజినోవా దంపతులు పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి కోడలు ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మామయ్యే మా కుటుంబం బలం, అందరికీ ఆదర్శం. ఉదారస్వభావం కలిగిన వ్యక్తి. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఉపాసన ట్వీట్ చేసింది.

Similar News