వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు ఆయన పశ్చిమగోదావరిజిల్లాలో మీడియాతో మాట్లాడారు. మంగళవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు దిగాడు. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించారు. బలమైన వ్యక్తిని కాబట్టే జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు.సమాజంలో మార్పు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మార్పు కోసం ప్రయత్నిస్తున్న తనపై బీజేపీ, వైఎస్ జగన్ విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకొన్న మీకే అంతుంటే నిజాయితీ పరుడైన నాకెంతుండాలి అంటూ జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగం రాసింది చంద్రబాబునాయుడు,వైఎస్ జగన్ కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.