సినిమా టాక్ ఎలా ఉన్నా ప్రస్తుతానికి ఓ ఫోటో మెగా అభిమానుల్ని ఫిదా చేస్తుంది. త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. ఈ సినిమా టాక్ ప్రస్తుతానికి ఓ మోస్తారుగా ఉన్నా మెగా అభిమానులు మాత్రం అజ్ఞాతవాసి ఫీవర్ తో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతవాసిని చూసిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆఫోటో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూ యాక్ట్ చేసింది. అయితే కుష్బూ కంపెనీలో మేనేజర్ గా చేరిన పవన్ కల్యాణ్ ఆమెకు ఆపదసమయాల్లో అండగా ఉంటాడు. అలా ఓ పోస్టర్ లో కుష్బూ సోఫాలో కూర్చుని ఉంటే... వెనకాలే పవన్ నిల్చుని ఉన్నాడు.. ఈ పోస్టర్ ని ఎడిట్ చేసిన అభిమానులు. ఖుష్బూ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవిని కూర్చోబెట్టారు. తమ ఆనందాన్ని సోషల్ మీడియాతో పంచుకోవడంతో ఫోటో వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాకు ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొని మేనమామలపై తన అభిమానాన్ని మరో చాటాడు.