కాలు బెణికినా... ప్రజాపోరాట యాత్ర కొనసాగించాలని జనసేన అధినేత పవన్ నిర్ణయించారు. భీమవరంలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే, ఇవాళ ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని రేపటి నుంచి ప్రజాపోరాట యాత్ర కొనసాగించేందుకు పవన్ సిద్ధమయ్యారు. బస చేసిన ఫంక్షన్ హాల్లోనే ఇవాళ విద్యార్థులు, దేవాలయ ధర్మాదాయ శాఖ సిబ్బందితో పవన్ ముఖా ముఖి నిర్వహించనున్నారు.