కత్తిమహేష్ - పవన్ కల్యాణ్ ల తారాస్థారాయికి చేరింది. గత కొద్దికాలంగా పాలిటిక్స్ , సినిమాలపైనే విమర్శలు ప్రతివిమర్శలు జరిగాయి. ఇప్పుడు వ్యక్తిగత విషయాల్లోకి ఎంటర్ అవ్వడంతో వాటిని ఫులిస్టాఫ్ పెట్టేలా పవన్ కల్యాణ్ ..రైటర్ కోనా వెంకట్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. తాజాగా కోన ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఎవరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకోవద్దు. ఇక క్రిటిక్ కత్తిమహేష్ తన వృధా చేసుకోవద్దని...సామాజిక కోణంలో ఉపయోగించాలి..” అంటూ కోనా వెంకట్ సూచించారు. ఈ వీడియోతో కత్తి మహేష్ కీ, పీకే ఫ్యాన్స్ కీ మధ్య జరిగే వివాదం సమిసినట్లేనని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.