పవన్కల్యాణ్, బాలకృష్ణ అభిమానులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగింది. గత రాత్రి పురుషోత్తపురంలో పవన్ అభిమాని హరిశ్చంద్ర, బాలయ్య అభిమాని ఫకీరు... ఇద్దరూ మద్యం సేవించి మా హీరో గొప్పంటే, మా హీరో గొప్ప అని వాదించుకున్నారు. క్రమంగా మాటలు పెరిగి, బాలయ్య అభిమాని ఫకీర్, పవన్ అభిమాని హరిశ్చంద్రపై ఒక్కసారిగా బ్లేడుతో దాడి చేశాడు. దీంతో పవన్ అభిమానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పవన్ అభిమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.