కశ్మీర్ వివాదాన్ని మరోసారి లేవనేత్తారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. కశ్మీర్లో ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేకుంటుందని ఈ అంశాన్ని తప్పకుండా ఐక్యరాజ్యసమితిలో ప్రస్తవిస్తనని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. పుల్వామాలో కశ్మీర్ ప్రజలను భారత ఆర్మి సిబ్బంది చంపడాన్ని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కశ్మీర్లో హింస, హత్యలతో సమస్యను పరిష్కరించలేవని దినికి మార్గంగా ఇరు దేశాలు మధ్య చర్చలు జరిగితేనే ఈ సమస్యని పరిష్కరింవచ్చని అన్నారు. ఈ అంశంపై కశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయ సేకరణ తప్పకుండా జరపాలని ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ను కోరుతామని వెల్లడించారు. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం కశ్మీరీలకే ఇవ్వాలని అన్నారు.