ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో

Update: 2018-03-02 09:38 GMT

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా.. రమేశ్ బాబు, మహేశ్ లు హీరోలుగా  ఎంట్రీ ఇవ్వ‌గా  రమేశ్ కొన్ని సినిమాలకే పరిమితం అయ్యారు. మహేశ్ మాత్రం.. స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మరోవైపు కృష్ణ అల్లుడు సుధీర్ బాబు బిజీగానే ఉన్నాడు. సీనియర్ నటుడు నరేష్ తనయుడు న‌వీన్  కూడా కృష్ణ ఇమేజ్ తోనే గుర్తింపు తెచ్చుకునే యత్నంలో ఉన్నాడు. 

తాజాగా రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం సినిమాతో బాలనటుడిగా పరిచయం అయిన జయకృష్ణ త్వరలోనే కథానాయకుడిగా తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌ వంటి వాటిలో జయకృష్ణ శిక్షణ తీసుకుంటున్నాడు.

Similar News