సినీనటి శ్రీరెడ్డి పోరాట విషయం పక్కదారి పట్టిందని సినీనటుడు నాగబాబు అన్నారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొద్ది రోజులుగా శ్రీరెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టిందని ఆయన అన్నారు. పేమెంట్స్, ఇతర విషయాల్లో సమస్యలు వస్తే పరిష్కరిస్తుందే తప్ప... సినిమాల్లో అందరికీ 'మా' అవకాశాలు ఇప్పించలేదని వివరించారు. 'మా' సభ్యత్వం కావాలంటే రూ. లక్ష చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. సీనియర్ నటులకు మాత్రమే గౌరవ సభ్యత్వం ఇస్తామని చెప్పుకొచ్చారు. అవగాహన లేకుండా 'మా'పై విమర్శలు చేయొద్దని...'మా' అధ్యక్షుడు శివాజీని బలిపశువును చేయొద్దని నాగబాబు కోరారు.