గవర్నర్ నరసింహన్ పై ఏపీ మంత్రి నక్కా ఆనంద్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థకు నరసింహన్ కళంకితమని విమర్శించారు. రాజకీయ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నాడని, కేంద్రానికి సంధానకర్తగా ఉంటున్నాడని ఆరోపించారు. మోడీ, అమిత్ షాలు మాఫియా ముఠా అని, ప్రతిపక్ష నేత జగన్ తో కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు గవర్నర్ పిలపించి మాట్లాడాల్సింన అవసరం ఏముంది అని మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు.