భారత మహిళా బాక్సింగ్ గ్రేట్, ముగ్గురు బిడ్డల తల్లి మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది. ఆరోసారి ప్రపంచ బంగారు పతకం సాధించి తనకు తానే సాటిగా నిలిచింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచ మహిళా బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్లో 35 ఏళ్ల మేరీ కోమ్...ఉక్రెయిన్ బాక్సర్ హన్నాను చిత్తు చేసి..బంగారు పతకాలు సాధించడంలో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. తన ఆరో బంగారు పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు...మేరీకోమ్ ప్రకటించింది.