సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. బాలీవుడ్ లో బయోపిక్ లు కలెక్షన్ల కనకవర్షంతో డైరక్టర్లు బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో మహానటి సావిత్రి, సైరా నరసింహారెడ్డి, స్వర్గియ ఎన్టీ రామారావు జీవిత చరిత్రలు తెరకెక్కుతున్నాయి. అయితే తాజాగా ఏపీ మాజీ సీఎం స్వర్గియ వైఎస్ఆర్ జీవితం ఆధారంగా సినిమాను నిర్మించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఫిల్మింనగర్ వర్గాల సమాచారం ప్రకారం గతంలో వైఎస్ ఆర్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలని డైరక్టర్ పూరిజగన్నాథ్ ప్లాన్ చేశాడు. అయితే అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే వైఎస్ ఆర్ జీవితాధారంగా ఓ బయోపిక్ రాబోతోంది. 'ఆనందో బ్రహ్మతో హిట్ కొట్టిన డైరక్టర్ మహి వి.రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో రాజశేఖర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరక్టర్ సినిమా సంబంధి వైసీపీ అధ్యక్షుడు జగన్ తో సంప్రదింపులు జరిపారని...వైఎస్సార్ బయోపిక్ కు జగన్ అంగీకరించనట్లు టాక్. అన్నీ కుదిరితే ఈ సినిమా త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా సినిమాకి సంబంధించి రాఘవ్ అధికారికంగా వెల్లడించనున్నారట.