పవన్ ఫ్యాన్స్పై విరుచుకుపడుతున్న కత్తి మహేశ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. అతనిని విమర్శిస్తూ పేజ్లు, ఫొటోలు సోషల్ మీడియాలో పెరిగిపోతున్నాయి. పందితో కత్తి మహేశ్ను పోల్చుతూ మెమ్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘నన్ను పందితో పోల్చుతూ ఇటీవల పుట్టుకొచ్చిన ఫేస్బుక్ పేజీల్లో అధికభాగం గీతా ఆర్ట్స్ ఆఫీసులోనే క్రియేట్ అయ్యాయని తెలిసింది. ఈ విషయంలో ఆ ఆఫీసు అధినేత అల్లు అరవింద్ తక్షణమే చర్యలు తీసుకొని, వికృత ప్రచారాన్ని ఆపేయాలి. తిట్టమని కోరుతూ పవన్ అభిమానులకు నా ఫోన్ నంబర్ షేర్ అయింది కూడా ఈ ఆఫీసు నుంచే! నిజానికి అల్లు అరవింద్తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు. వికృతపర్వాల సంగతి ఆయనకు తెలిసి ఉంటే గనుక అలాంటి శునకానందానికి దూరంగా ఉండాలని కోరుతున్నా’’ అని కత్తి మహేశ్ రాసుకొచ్చారు.