కొత్తసంవత్సరం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలా తాను ఓ నిర్ణయం తీసుకున్నానని అంటున్నారు విశ్లేషకుడు కత్తిమహేష్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, జనసేన అభిమానులపై తన ప్రతాపాన్నిచూపిస్తూ ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ పిచ్చి సేన బూతుల్ని ఖండించే ధైర్యం లేని వాళ్ళు, నాకు నీతులు చెప్పడంలో మట్టుకు ముందు ఉంటారు. నా గోల నాది. నా బాధ నాది. నా పోరాటం నాది. మిమ్మల్ని పట్టించుకొమ్మని నేను అనడం లేదు. నాకు మద్దత్తు కావాలని నేను కోరడం లేదు. నా వైఖరి మీకు చిరాకుని కలిగిస్తే నన్ను బ్లాక్ చెయ్యండి. అయిపోతుంది.
నేను ఫోటో పెట్టినా, ఒక వీడియో యూట్యూబ్ లో పెట్టినా, రివ్యూ చెప్పినా ఎక్కడ పడితే అక్కడ నన్ను అమ్మానా బూతులు తిడుతూ, కొడతాము, చంపేస్తాము అని పబ్లిక్ గా బెదిరిస్తుంటే పవన్ కళ్యాణ్ అనే ఒక బాధ్యతారహిత వ్యక్తి, నటుడు, సోకాల్డ్ నాయకుడు ఇంతవరకు ఒక ఖండన కూడా చేయలేదు. అలాంటి మనిషికి బాధ్యత నేర్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఒక అల్లరి మూకతో అలుపెరగని పోరాటం చేస్తున్నాను. ఒక రాజకీయ జోకర్ ని బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను. మీ సుఖాలలో, సంతోషాలతో, ఆనందాలలో మీరు ఉండండి. నా పోరాటాలలో నేను వుంటాను. I am a fighter and will fight and I don't need anyone. నాతో ఉన్నవాళ్లు నాతో వుంటారు. పోయేవాళ్ళు దయచేసి వెళ్లిపొండి. నా ఫేస్ బుక్ వాల్ నుంచి. నా జీవితం నుంచీ. సింపుల్.
ఇదే నా కొత్త సంవత్సరపు నిర్ణయం. నా ఆత్మగౌరవాన్ని మించింది ఏదీ లేదు. నా ప్రాణంతో సహా!