ఇండోనేషియాలో మరో విమానం కూలింది. జకార్తా నుంచి పంగకల్ పినాంగ్ బయలు దేరిన లయన్ ఎయిర్ బోయింగ్ విమానం... టేకాఫ్ అయిన 13 నిమిషాలకే ఏటీసీ నుంచి సంబధాలు తెగిపోయాయి. ఈ ఉదయం 6 గంటల 33 నిమిషాలకు సముద్రంలో కూలిపోయిందని గుర్తించిన ఇండోనేషియా ప్రభుత్వం... సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇందులో మొత్తం 188 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారంతా మరణించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.