ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులు- సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మధ్య ఘర్షణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఎడతెగని టీవీచర్చలకు, వాదప్రతివాదాలకు దారితీస్తూ.. ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో సినీ మాటల రచయిత కోన వెంకట్ రంగంలోకి దిగారు. జనవరి 15 వరకు అందరు మౌనంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. దీంతో పవన్ అభిమానులు- కత్తి మధ్య జరుగుతున్న వివాదానికి పులి స్టాప్ పడ్డట్టే అని అందరు భావించారు. కాని జనవరి 15 తర్వాత కూడా కోన వెంకట్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయే సరికి కత్తి మహేష్ తన ట్విట్టర్ ద్వారా కోన వెంకట్కి ట్వీట్ చేశాడు.
‘ఎక్కడున్నారు సర్? నేను మౌనంగా ఉన్నప్పటికీ నాతో పాటు నా కుటుంబానికి కూడా పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి వేధింపులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, మీరేం చేయగలరు?’ అని కత్తి మహేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ కోన కౌంటర్ ఇచ్చారు . ‘దురదృష్టవశాత్తు ఈ నెల 7న ట్వీట్ పెట్టిన తర్వాత కూడా నువ్వు అదే అంశం మీద కొన్ని టీవీ చానళ్ల డిబేట్లో పాల్గొన్నావు. పవన్ కల్యాణ్, అతని అభిమానులను ఎటాక్ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా?’ అని కోన వెంకట్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Unfortunately, after my tweet on 7th, u continued ur debates on the same issue in few channels and also involved some student organisations in attacking PK & his fans.. Does “SILENCE” has different meaning in ur dictionary?? https://t.co/wXETH2BpbM
— kona venkat (@konavenkat99) January 17, 2018