మెగా పవర్ స్టార్ రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ రంగస్థలం. ప్రపంచవ్యాప్తంగా 17వందల థియేటర్లలో విడుదలైంది. మూడు గంటల నిడివితో వచ్చిన రంగస్థలం...ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యాన్ని సుకుమార్ కళ్లకు కట్టినట్లు బాగా చూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా గురించి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాపై తాజాగా కత్తి మహేష్ రివ్యూ ఇచ్చారు. స్టోరీ పాతదేనని.. కానీ రత్నవేలు, నటీనటులు తమ టాలెంట్తో ఆకట్టుకున్నారని మహేష్ రివ్యూలో పేర్కొన్నారు. ‘‘రంగస్థలం పాత సీసాలో పాత సారాయి. 80లో స్టోరీని 80 నాటి స్టైల్లో, సెట్టింగ్స్తో ప్రెజెంట్ చేశారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బ్రిలియంట్గా ఉంది. నటీనటుల పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. పెద్ద సినిమా అయినప్పటికీ ప్రేక్షకులను నటీనటులు వారి నటనతో ఆకట్టుకున్నారు అని కత్తి మహేష్ రివ్యూలో పేర్కొన్నారు.
#Rangasthalam is old wine in old bottle. 80s story told in 80s style and setting. Ratnavelu's brilliant cinematography. Very good performances from the entire cast make this unnecessarily long film bearable. pic.twitter.com/tnGv1bwkhP
— Kathi Mahesh (@kathimahesh) March 30, 2018