జగన్ పాదయాత్రకు కాపు రిజర్వేషన్ సెగ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం మండలం పెదపూడిలో కాపు వర్గానికి చెందిన యువత.. జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలంటూ పాదయాత్రలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అయితే దీనిపై ఏమాత్రం స్పందించకుండానే.. జగన్ ముందుకు వెళ్లారు. ఇటు పోలీసులు మాత్రం.. నిరసన తెలుపుతున్న యువకులను పక్కకు లాగేశారు.