జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో బీజీబీజీగా ఉన్నారు. అయితే అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో డాక్టర్లతో సమావేశం అయ్యారు. జనసేన ప్రవాస గర్జనలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ మాట్లాడుతూ తుది శ్వాస వదిలోపు ఎంతోకొంత మార్పు తెస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు రాజకీయం అంటే తెలియదని, మానవత్వం మాత్రమే తెలుసునని పెర్కోన్నారు. డబ్బుతో సమాజంలో మార్పు సాధ్యం కాదని స్పష్టం చేశారు. డాక్టర్లు ఆ దేవుడితో సమానంగా భావిస్తున్నామని, డాక్టర్లను జనసేన పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటుందని పవన్ పేర్కొన్నారు.