టీమిండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్ విలవిల్లాడింది. భారత్పై అతి తక్కువ స్కోరుకే ఆలౌటైంది. కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. బౌలర్లంతా కలిసికట్టుగా రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలోనే చాప చుట్టేసింది. కేవలం ముగ్గురు బ్యాట్స్మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.