పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఓ ట్విట్టర్ సందేశం ఇచ్చాడు. అభిమానులను పవన్ను హీరోగా చూడొద్దని మన నాయకుడు అని మాత్రమే అనుకోండని సూచన చేశారు. గతంలో మహేష్కు, ఆదికి మధ్య కూడా వివాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేష్ విషయంలో ఇన్వాల్వ్ కావొద్దని పరోక్షంగా పవన్ అభిమానులకు హైపర్ ఆది తెలిపాడు. ‘మీ అడుగులు ఇక మంచి కోసం వేయండి. రాజకీయంలో 100మంది 100 రకాలుగా మాట్లాడుతారు అందరినీ చూడాలి.. నవ్వుకోవాలి.. వదిలేయాలి. ఆయన ఇప్పుడు ప్రజల మనిషి మన హీరో అనుకోవడం మానేయండి మన నాయకుడు అని మాత్రమే అనుకోండి.’ అంటూ ఆది ట్వీట్ చేశాడు.