తెలంగాణ అసెంబ్లీ రద్దు రాజ్యాంగ బద్ధంగా జరగలేదంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణతో పాటు శశంక్రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు వాడివేడిగా వాదనలు జరిగాయి. శాసనసభటను సమావేశపరచకుండా అసెంబ్లీని రద్దు చేయడం వల్ల సభలోని సభ్యులకు ఈ విషయం తెలియలేదంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ప్రభుత్వానికి బాధ్యత వహించే మంత్రి మండలి ఆమోదంతోనే సభను రద్దు చేసినట్టు అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.