మనసున్న సూర్య...రైతులకు భారీ సాయం

Update: 2018-07-24 10:19 GMT

కోలీవుడ్‌లో మరో నటుడు పెద్దమనసుతో ముందుకొచ్చాడు. స్టార్‌హీరో సూర్య రైతులకు భారీ విరాళం అందజేశాడు. ఇటీవల తమ్ముడు కార్తీ హీరోగా తాను నిర్మించిన ‘చినబాబు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రైతు సమస్యలపై వచ్చిన ఈ సినిమా తెలుగు తమిళ భాషాలో విడుదలై మంచి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో సూర్య ఆరుగురు రైతులకు రూ. 12 లక్షల సాయం అందజేశాడు. అంతేకాదు  రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో వచ్చిన లాభాల నుంచి ఈ చేయూత అందిస్తున్నట్లు తెలిపాడు. కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చినబాబు సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై స్యయంగా నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమా తెలుగు నాట పరవాలేదనిపించగా కోలీవుడ్ లో మాత్రం భారీ వసూళ్లను సాదిస్తూ దూసుకుపోతోంది.  రైతు సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, అలకలు, కోపాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు పాండిరాజ్‌.

Similar News