గ్రీస్ లో రగిలిన కార్చిచ్చు అడవులను, ఇండ్లను దహించి వేస్తోంది. అడవుల్లో చెలరేగిన మంటలు రాజథాని ఏథెన్స్ శివార్లకు కూడా వ్యాపించడంతో ఇప్పటికే 74 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు వెయ్యికి పైగా ఇండ్లు వందల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయని అధికారులు తెలిపారు. మంటల నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సముద్రం వద్దకు పరుగులు తీస్తున్నారు. అడవుల్లో రగిలిన ఈ కార్చిచ్చు మంగళవారం పట్టణాలకు వ్యాపించింది. దీంతో ఏథెన్స్ నగరానికి సమీపంలో సముద్ర తీరాన ఉన్న అనేక పట్టణాలు ఆహుతయ్యాయి. బీచ్లలో చిక్కుకుపోయిన పర్యాటకులను, దేశ పౌరులను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
కార్చిచ్చు కారణంగా అనేక ప్రాంతాల్లో మంటలకు కాలిపోయిన మనుషులు, పశువులు, జంతువుల మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారని అన్నారు. మాటీ నగరంలోని ఓ