ప్రముఖ సినీ తార శ్రీదేవి గుండెపోటుతో దుబాయ్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయింది. అప్పటికే శ్రీదేవి బంధువు సౌరభ్ మల్హోత్ర భారతీయ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి భౌతిక కాయాన్ని తీసుకెళ్లే అనుమతుల గురించి వాకబు చేశారు. ఈ రోజు సాయంత్రం 5.30గంటలకు ప్రత్యేక విమానంలో ముంబయికి బయలుదేరే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి ముంబయి చేరుకుంటుంది. అనంతరం ఆమె పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించనున్నారు. మరోపక్క రేపు శ్రీదేవి అంత్యక్రియలను నిర్వహించేందుకు ముంబయిలోని ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీదేవికి చెందిన భాగ్య బంగ్లాలో అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు. దుబాయ్లోని ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి గుండె పోటుతో మరణించారు. ఆమె మరణం వెనుక ఎలాంటి కుట్రలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికను అక్కడి అధికారులు భారత కాన్సులేట్ అధికారులకు అందజేశారు. ఈరోజు సాయంత్రం 5.30గంటలకు దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్కు తరలించనున్నారు.