శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయి పోలీసులు ఆమె కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు శ్రీదేవి కుటుంబ సభ్యులకు, దుబాయ్లో భారత కాన్సులేట్కు క్లియరెన్స్ లేఖను జారీ చేశారు. అనంతరం భౌతికకాయాన్ని ఎంబాల్మింగ్ ప్రక్రియకు తరలిస్తారు. ఈ ప్రక్రియకు మరికొంత సమయం పడుతుంది. ఈ రోజు రాత్రికి శ్రీదేవి పార్థివదేహం ముంబయికి చేరుకునే అవకాశం ఉంది.