యాంకర్ రష్మిపై దర్శకుడి సంచలన కామెంట్స్!

Update: 2018-08-06 11:49 GMT

రష్మి నటించిన 'అంతకు మించి' మూవీ ఆగస్టు 24న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రష్మి మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఫిలిం నగర్ లో 'అంతకుమించి' సినిమా పోస్టర్ చూసినప్పుడు అందులో రష్మి తొడలు, ఆమె వెనుక ఉన్న బీచ్ సీన్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్స్ ను పాజిటివ్ గా తీసుకున్న రష్మి.. మా సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు పోస్టర్ తో కనెక్ట్ అయినందుకు మీకు థాంక్స్. మీ ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను అంటూ వెల్లడించింది. 
 

Similar News