మాజీ ఎంపీ కవితపై ఖుష్బూ సెటైర్లు..

Update: 2018-11-29 12:49 GMT

కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూ టీఆర్ఎస్ ఆపద్దర్మ మంత్రి కల్వకుంట్ల కవితపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార భాగంలో ఖుష్బూ మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక్క కవితకు మాత్రమే మేలు జరిగిందని ఆరోపించారు. ఇక బతుకమ్మ చీరాల విషయాన్ని ప్రసవిస్తూ బతుకమ్మ చీరల్లో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందని తెలింపింది. అన్నింట్లో తెలంగాణ రాష్ట్రం ముందు వుందని చెబుతున్నారు అది అవినీతిలో తెలంగాణ రెండోస్థానంలో ఉందని వెల్లడించారు. కేసీఆర్‌ది రైతు, మహిళా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ-టీఆర్ఎస్ లోపాయికారి చికటి ఒప్పందం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Similar News