క్రిటిక్ కత్తిమహేష్ పై కమెడియన్ వేణుమాదవ్ సెటైర్లు వేశారు. ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన మహేష్. పవన్ కల్యాణ్, హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రెస్ మీట్ అనంతరం ఓ లైవ్ షోలో పాల్గొన్న మహేష్ కు చురకలంటించారు వేణుమాధవ్. ఓ ఛానల్ నిర్వహించిన లైవ్ షోలో ఫోన్లో మాట్లాడిన వేణుమాధవ్ తాను పెద్దవాళ్లతో, అంకుల్స్ తో మాట్లాడనంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు లైవ్ లో పవన్ అభిమానులు మాట్లాడవద్దని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘మా’ సభ్యురాలు పూనమ్ కౌర్ పై ఆరోపణలు చేసినందకు కత్తిమహేష్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దల్ని గౌరవిస్తానని అలాగే ఆ అంకుల్ (మహేష్) ని గౌరవించాల్సిన బాధ్యత తనకుందని చమత్కరించారు. కత్తి మహేష్ కు ఆరోగ్యం పాడై ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే తాను పూనమ్ కౌర్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. మా అసోషియేషన్ తనను పిలిస్తే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు కత్తిమహేష్ . ఆ సమయంలో పూనమ్ కౌర్ కూడా రావాలని సూచించారు.