తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెజవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే గన్నవరం ఏయిర్పోర్ట్కు చేరుకున్న ఆయనకు.. మంత్రి దేవినేని ఉమా ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన నేరుగా గేట్ వే హోటల్కు వెళ్లారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. ముక్కుపుడక కూడా సమర్పించుకోనున్నారు. 40 నిముషాల పాటు అమ్మవారి సన్నిధిలోనే గడపనున్నారు.